(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తాజాగా ప్రజలకు పోలీసు శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేలా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో రాష్త్రంలోని అన్ని పోలీసు స్టేషన్ లను అనుసంధానం చేస్తూ.. కొత్తగా మొబైల్ అప్లికేషన్ రూపొందించారు. దీన్ని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం లో సోమవారం ఉదయం ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి ప్రారంభించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా ప్రజలకు అనేక ఉపయోగాలు కలుగనున్నాయి.
ఇకపై ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఈ యాప్ ద్వారా 87 రకాల సేవలు పొందవచ్చు. అన్ని రకాల నేరాలపై ఫిర్యాదుల చేయడానికి ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్ళనవసరం లేదు. యాప్ ద్వారానే పోలీసు వారికి ఫిర్యాదు చేసి దానికి సంబంధించిన రశీదు సైతం అదే యాప్ నుంచి పొందవచ్చు. అదే విధంగా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చు.