అమరావతి: రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేశారు. రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు విజయవాడ గేట్వే హోటల్కు చేరుకున్న గవర్నర్ నరసింహన్తో సిఎం జగన్ భేటీ అయ్యారు.
శనివారం ఉదయం సచివాలయ ఆవరణలో నూతన మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
కొద్ది సేపటిలో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.