పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శించి అధికారులతో సమీక్ష జరిపారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన జగన్ గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులతో సమీక్ష సందర్భంగా 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరు అందించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం ముందుగా నిర్దేశించిన ప్రకారం ఎఫ్ ఆర్ ఎల్ లెవెల్ 45.72 మీటర్లు ఉంటుందని, అదేవిధంగా టాప్ ఆఫ్ మెయిన్ డ్యాం లెవెల్55 మీటర్లు ఉంటుందని జగన్ చెప్పారు. డ్యామ్ నిర్మాణంతో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. నిర్వాసితులకు ఏం చేస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులను దర్శించారు. తొలుత స్పిల్ వే వద్ద ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీ సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత, గోపాలకృష్ణ,ఎంపీలు భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధికారులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సీఎం జగన్ కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.