NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

పోలవరం ప్రాజెక్టు నిధులకై పీఎం మోడీకి ఏపి సీఎం జగన్ లేఖ

CM Jagan Delhi Tour: Another Fight on HighCourt?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంపై ఏడు పేజీల లేఖ రాశారు. సీడబ్ల్యుసీ సిఫార్సు చేసిన సవరణలను ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యల పైన కేంద్రం సారించాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారు  నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ లేఖ లో ఆందోళన వ్యక్తం చేశారు.

CM Jagan Delhi Tour: Another Fight on HighCourt?

ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసానికి నిధులు ఇవ్వాలని జగన్ కేంద్రాన్ని కోరారు. పోలవరం నిధుల  విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 2014 ఏప్రిల్ 29 క్యాబినెట్ తీర్మానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ.12,520 కోట్లు ఖర్చు పెట్టిందనీ, కేంద్రం రూ.8,507 కోట్లు చెల్లించిందని ఇంకా రూ.4,013 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.  ప్రాజెక్టు పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని 2017 మే 8న కేంద్ర జలవనరుల శాఖ లేఖలో తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం కేంద్రం కొత్త షరతులు తెస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోతుందని అన్నారు. ఇప్పుడు నిధుల జాప్యం చేస్తే అంచనా వ్యయం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 2013-13 ప్రకారం కేవలం 20,398 కోట్లు మాత్రమే ఇస్తామని ఇప్పుడు అంటున్నారనీ కానీ పునరావాసం, భూసేకరణకే రూ.28,191 కోట్లు ఖర్చు అవుతుందని ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందని ప్రశ్నించారు. ప్రధానిగా తక్షణం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ఆర్థిక, జలశక్తిమంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి అయ్యేలా సహకరించి ప్రాజెక్టును  2021 డిసెంబర్ నాటికి జాతికి అంకితం చేయాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు.

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?