ఏ పార్టీలో యువరక్తం చాలా ముఖ్యం. టీడీపీలో అది కరువయింది. అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీ ఎలా దిగజారిపోతున్నదో అందరం చూస్తూనే ఉన్నాం. కానీ.. అధికార వైసీపీ పార్టీలో యువనేతలే ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎక్కువ మంది యువనేతలే. యువనేతలు ఉన్న పార్టీ ఎలా ఉండాలి.. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సరికొత్తగా ఉండాలి… ప్రజలకు నచ్చేలా ఉండాలి.. అన్నింటికి మించి పార్టీ గురించి ప్రపంచానికి తెలియాలి.
వైసీపీలో సీఎం దగ్గర్నుంచి.. చిన్న స్థాయి నేతల వరకు చాలామంది యువకులే. మహిళా మంత్రులు కూడా 45 ఏళ్ల లోపు ఉన్నవారే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్లోనూ అంతే. ఎక్కువ మంది 45 ఏళ్ల లోపు వాల్లే. ఇంత యువశక్తి పార్టీలో ఉందటే.. పార్టీ ఎక్కడికో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు.
కానీ.. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..మంత్రులయినా… ఎమ్మెల్యేలు అయినా.. ఎంపీలు అయినా.. యువనేతలంతా ఎందుకో పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా యువనేతలు బయటికి కూడా రావడం లేదు.
కనీసం తమ నియోజకవర్గాల్లో కూడా నేతలెవ్వరూ కనిపించడం లేదు. దానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ.. ముఖ్య కారణం మాత్రం మమూడు రాజధానులేనట. అవును.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అజెండా వల్ల, జిల్లాలను విభజించడం లాంటి నిర్ణయాల వల్ల ఎందుకో యువనేతలు పెద్దగా బయట తిరగలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
యువనేతల నుంచి ఎటువంటి సలహాలు తీసుకోకుండా.. సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వాళ్లు కొంచెం అసంతృప్తితోనే ఉన్నారట. పార్టీలో యువరక్తం ఉన్నప్పటికీ.. వాళ్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. మా సంగతి ఇంతేనా.. పదవులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మాకు బాధ్యత ఉండదా? రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? వాళ్లు నిలదీసేది మమ్మల్నే. వాళ్లకు సమాధానం చెప్పలేక, బయటికి వెళ్లలేక టార్చర్ అనుభవిస్తున్నామంటూ యువనేతలు తమలో తామే కుమిలిపోతున్నారట.
అయినా ఒక యువ నేత అయి ఉండి.. పార్టీలో ఉన్న యువతను జగన్ వాడుకోకుండా.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు.. అదే ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.