(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) నుండే మూడు నకిలీ చెక్కులతో రూ.112 కోట్ల కొట్టేయాలన్న దుండగుల పన్నాగాన్ని బ్యాంక్ అధికారులు గుర్తించి భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా పరిగణిస్తూ..ఏసిబి దర్యాప్తునకు ఆదేశించారు.
నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఇంత పెద్ద భారీ మొత్తంలో కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన వారు ఎవరు? పాత్రధారులు ఎవరు ? సూత్రధారులు ఎవరు ? అనేది నిగ్గు తేలాలంటే లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి జరిపి బాధ్యులను గుర్తించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఏసిబి డైరెక్టర్ జనరల్ పిఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం జగన్ లేఖ రాశారు.అదే విధంగా సిఎంఆర్ఎప్ చెక్కులకు సంబంధించి చెల్లింపులు కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించారు.
మూడు రాష్ట్రాల్లో మూడు వేరువేరు పేర్లతో ఈ నెల 7,9,14 తేదీల్లో రూ.112 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేయడానికి నకిలీ చెక్కులను బ్యాంకులో ప్రజెంట్ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు అధికారులు ఆవి నకిలీ చెక్కులన్న అనుమానం వచ్చి చెల్లింపులను నిలుపుదల చేసి సిఎం సహాయ నిధి అధికారులకు సమాచారం అందించగా వారు పరిశీలన జరిపి నకిలీ చెక్కులని నిగ్గు తేల్చారు. ఏసిబి దర్యాప్తుతో ముఠా గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?