Adimulapu Suresh: ఏపి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఇటీవల జరిగిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ప్రసంగించిన మంత్రి ఆదిమూలపు సురేష్ అనంతరం అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వైద్యులు అత్యవసర శస్త్ర చికిత్స అనంతరం యాంజియోప్లాస్టీ చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి సురేష్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.