అమరావతి: నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయంలో అడుగుపెట్టే శుభ ముహూర్తం ఖరారయింది.
జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం 8.39గంటలకు సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి జగన్మోహనరెడ్డి అడుగుపెట్టనున్నారు.
ఈ విషయాన్ని వైసిపి వర్గాలు దృవీకరిస్తున్నాయి.
ఇప్పటికే సచివాలయం మొదటి అంతస్తులో వాస్తులోప నివారణ చర్యలను అధికారులు చేపట్టారు. పండితుల సూచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చాంబర్ ఏర్పాటు పనులను ఈ లోపుగా అధికారులు పూర్తి చేయనున్నారు.