AP CM YS Jagan: దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక మంది ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకడంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు కరోనా సోకడంపై సీఎం జగన్ ఈ విధంగా ట్వీట్ హుందాతనం ప్రదర్శించగా, విజయసాయిరెడ్డి మాత్రం వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Read More: MP RRR: ఇక దేవుడు కూడా కాపాడలేడు .. డిల్లీ నడిబొడ్డులో రఘురామ అరస్ట్ ??
AP CM YS Jagan: బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది గానీ..
యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్ వర్థంతి నాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది గానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుండిపోతుందని వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి ట్వీట్ పై నెటిజన్ లు తీవ్ర స్థాయిలో ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు.
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందనీ, లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఉదయం పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు హోం క్వారంటైన్ లో ఉన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు కూడా నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో లోకేష్ కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
Wishing a speedy recovery & good health for Sri @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 18, 2022
యాదృచ్ఛికమే అయినా, ఎన్టీఆర్ వర్థంతినాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరం. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిగానీ, టీడీపీ వ్యవస్థాపకుడికి బాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 18, 2022