పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తో ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు వందల మందికి పైగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు కి చేరుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులతో సిఎం జగన్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యసేవలు పై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో వై ఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఎపిడమిక్ కంట్రోల్ అయ్యే వరకు ప్రత్యేక శిబిరాలను కొనసాగించాలని,24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిఎం ఆదేశించారు. ఎందువల్ల ఈ వ్యాధి వచ్చింది అనే విషయాలను అధికారులు తెలుసుకొనే ప్రయత్నం చేయాలన్నారు.
తదుపరి జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి కి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా ఈ రోజు కూడా మూర్ఛ లక్షణాలతో మరి కొంత మంది ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345 కు చేరుకున్నది.ఈ కార్యక్రమాలో జగన్ వెంట మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?