విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటేత్తారు. మరో పక్క ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలను అందజేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయయణ. ఆలయ ఇఓ భ్రమరాంబ లు సీఎం జగన్ జగన్ కు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
తొలుత ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్ కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ రాకను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
పూణే లో చాందినీ చౌక్ పాత వంతెనను ఇలా కూల్చేశారు..వీడియో వైరల్