AP CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపటి నుండి రెండు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు పులివెందుల, వేంపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ .. ఎల్లుండి ఇడుపులపాయిలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. రేపు (7వ తదీ) ఉదయం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ 9.30 కి బయలుదేరి 10.20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి 10.30 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి 10.55 గంటలకు పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 11 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
11.05 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై వారి నుండి వినతులు స్వీకరిస్తారు. 1.05 గంటలకు గెస్ట్ గౌస్ నుండి బయలుదేరి 1.15 గంటలకు పులివెందుల లోని ఏపి కార్ల్ చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల వరకూ ఉండి క్షేత్ర స్థాయి పర్యటన చేస్తారు. ఆ తరువాత 1.35 గంటలకు ఎపి కార్ల్ ప్రధాన భవనానికి చేరుకుని న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీటింగ్ లో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడ నుండి రోడ్డు మార్గంలో 2.45 గంటలకు బాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 3.05 గంటలకు వెంపల్లి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాలు నేతతో మాట్లాడి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు వైఎస్ఆర్ స్మారక పార్క్ కు చేరుకుని పార్క్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ కు చేరుకుని భవనాలను ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధినీ విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం 5 గంటలకు వేంపల్లి హెలిఫ్యాడ్ వద్ద కు చేరుకుంటారు. 5.05 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. 5.20 కి హెలిప్యాడ్ నుండి బయలుదేరి 5.25 గంటలకు ఇటుపులపాయలోని వైఎస్అర్ ఎస్టేట్ కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
8 వ తేదీ (ఎల్లుండి) ఉదయం ఇడుపులపాయ లోని వైఎస్ఆర్ ఎస్టేట్ నుండి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. 8.45 గంటలకు వైఎస్అర్ ఘాట్ నుండి బయలుదేరి 8.50 గంటలకు ఇడుపులపాయ లోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి 9.10కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. తర్వాత 9.20 గంటలకు కడ ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి 10.20 గంటలకు రోడ్డు మార్గన బయలుదేరి గుంటూరు అచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొంటారు.