ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు నిర్వహించగా 1155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఏపీ లో ఇదే తొలిసారి. అలాగే రోజుకి నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సఖ్యలో ఏపీ1000 మార్క్ ను దాటేసింది.
గడచిన 24 గంటల్లో 13మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 252కి చేరింది. గత 24 గంటల్లో 762మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 238, అనంతపురం జిల్లాలో 153, విశాఖపట్నం జిల్లాలో 123, తూర్పుగోదావరి జిల్లాలో 112, శ్రీకాకుళం జిల్లాలో 104, కృష్ణా జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 84, చిత్తూరు జిల్లాలో 66, పశ్చిమగోదావరి జిల్లాలో 49, నెల్లూరు జిల్లా 39, విజయనగరం జిల్లా 30, ప్రకాశం జిల్లాలో 29, కడప జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి.