అమరావతి : పెట్రో ధరల పెంపుదలపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు.. నోరు మెదపక పోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు పట్టారు. ప్రధాన మంత్రి మోడీ అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులకు భయమేమో అని ఎద్దేవా చేశారు.
15 రోజులు వరుసగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని రామకృష్ణ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకపక్క కరోనా మహమ్మారి వల్ల అల్లాడుతున్న ప్రజలపై కేంద్రం పెట్రో ధరల భారం మోపటం దుర్మార్గం అని ఆయన అన్నారు. గత 15 రోజులుగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే ఉన్నాయని, పెట్రోల్ ధర లీటర్ కు రు.8.88లు పెంచారని ఆయన పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?