అమరావతి: మంత్రివర్గ సమావేశం నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసేందుకు గాను గురువారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టారు. ఈ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హజరుకావాలని బుధవారం ఆదేశించారు.
కరువు, ఫొని తుఫాను, ఉపాధి హామీ పథకం అమలు, మంచినీటి సమస్య తదితర విషయాల గురించి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.
ఎన్నికల మార్గదర్శక నియమావళికి అనుకూలంగా నివేదికలు ఉంటేనే మంత్రివర్గ సమావేశ నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.
మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహించాలని ముందుగా భావించినా ఎన్నికల సంఘం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉండటం, ఆయా శాఖల నుండి నివేదికలను సిద్ధం చేయడం తదితర అంశాల కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేశారు.
గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే పరిశీలన సమావేశానికి అధికారులు అందరూ నివేదికలతో రావాలని సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం ఆదేశించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?