అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ పంపారు.
సిఎస్ పంపిన జాబితాలో నళినీ ప్రభాత్ (1992 బ్యాచ్), కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి ఉజెలా (1994 బ్యాచ్ )లు ఉన్నారు. వీరిపై ఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్లో లేవని సిఎస్ పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.