అమరావతి: ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎల్.వి. సుబ్రమణ్యం సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డిజిపి ఆర్పీ ఠాకూర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంలు, సిబ్బంది తరలింపుపై సిఎస్ సూచనలు ఇచ్చారు.
ఈ నాలుగు రోజుల పాటు తనిఖీలు ముమ్మరం చేయాలని సిఎస్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సౌకర్యాల ఏర్పాటుపై కూడా సిఎస్ సూచనలు చేశారు.
అంతకు ముందు సచివాలయంలో సిఎస్ ఎన్నికల నిర్వహణపై ద్వివేది, ఆర్పీ ఠాకూర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఆయా విభాగాల అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష జరిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?