Ap Curfew: రాష్ట్రంలో కరోనా కట్టడి కి సంబంధించి వైద్య అధికారులతో మరియు ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం గురించి వివరాలు అధికారుల వద్ద అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ క్రమంలో అన్ని జిల్లాలలో కర్ఫ్యూ సడలింపు ఒకేలా ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు.. కర్ఫ్యూ రాష్ట్రంలో అమలు చేయాలని ఈ సమావేశంలో ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
మొన్నటివరకు ఉభయగోదావరి జిల్లాల మినహా మిగతా జిల్లాలలో.. ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సడలింపు ఇచ్చారు. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఉదయం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు కర్ఫ్యూ సడలింపు పొడిగిస్తూ… ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో దుకాణాలు కరెక్ట్ టైం కి లేకపోతే జరిమానా విధించే లా.. కమిటీలు ఉండాలని ఇదే రీతిలో ఉల్లంఘనలు పాటించని దుకాణాలకి సంబంధించి ఫోటోలు.. వాట్సాప్ నంబర్ కి పంపించాలా ప్రత్యేకమైన నెంబర్ ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు.
Read More: AP CM YS Jagan: ఆర్థిక పనుల నిర్వహణ సులభతరంకై సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
మాస్కు తప్పనిసరిగా ధరించాలి ఎలా లేకపోతే 100 రూపాయలు జరిమానా.. వసూలు చేసేలా కఠినంగా వ్యవహరించాలని సమావేశంలో ప్రభుత్వ అధికారులు డిసైడ్ అయ్యారు. బయట బహిరంగ ప్రదేశాలలో మార్కెట్ వంటి చోట్ల ప్రజలు మాస్కులు ధరించేలా అక్కడ ఉండే కమిటీ సభ్యులు బాధ్యత తీసుకునే విధంగా వ్యవహరించాలని ఈ సమావేశంలో అధికారులకు జగన్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.