ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామాన్య జనాలతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం అంజద్ బాషాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
సీఎం కడప జిల్లా పర్యటన నేపథ్యంలో పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు, నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో అంజద్ బాషాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రేపటి నుండి 28 రోజుల పాటు బాషా గృహ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో బాషాను పర్యటనకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. బాషాతో పాటు ఆయన గన్ మెన్ కు కూడా పాజిటివ్ అని తేలింది.