అమరావతి: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజధాని పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్పై చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. చెప్పులు విసిరిన వ్యక్తి రైతుగా, రాళ్లు విసిరిన వ్యక్తి రియల్టర్గా చెప్పారని ఆయన వివరించారు. చంద్రబాబు వల్ల అన్యాయం జరిగిందని వారంతా చెప్పారని అన్నారు.
ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్చతో పాటు ఏదైనా అన్యాయం జరిగితే నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఉంటుందని సవాంగ్ వివరించారు. ఇలాంటి సమయాల్లో పోలీసులను తప్పుబట్టడం సహజమేనని అన్నారు. మొన్న అనుమతి ఇవ్వకుంటే పర్నాడు ఇష్యూ చూశారని గుర్తు చేస్తూ ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే ఇలా జరిగింది, ఇవ్వకపోతే ఇంకా పెద్దగా జరిగేదని పేర్కొన్నారు. తమ విచారణలో వివాదాలు జరగవని తేలడం వల్లనే చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చామని సవాంగ్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఏలాంటి నిషేదాజ్ఞలు పెట్టలేదని సవాంగ్ వెల్లడించారు.