ఆంధ్రప్రదేశ్ డిజిపి దామోదర్ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ ప్రారంభమైంది. గత సంవత్సరం నవంబర్ లో చేపట్టిన ఇదే ఆపరేషన్ కింద దాదాపు 2,774 వీధి పిల్లలను మరియు బాల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. వారిలో కొంతమందిని వారి కుటుంబ సభ్యులతో కలపగా మిగిలినవారిని పిల్లల సంరక్షణ సెంటర్లలో ఉంచారు.
అయితే ఇప్పుడు ఈ కరోనా సంక్షోభ సమయంలో మళ్లీ ఇదే ‘ఆపరేషన్ ముస్కాన్’ ను ఏపీ డిజిపి ఘనంగా ప్రారంభించారు. వీధి బాలలను బాలికలను మరియు బాలకార్మికులను గుర్తించి ఆపరేషన్ ముస్కాన్ కి సంబంధించిన బస్సు వెంటనే వారిని శిశు సంరక్షణా కేంద్రాలకు, పిల్లల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు.
ఎవరైనా తప్పిపోయిన పిల్లలు ఉంటే వారిని తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుస్తారు. ఇక ఈ కరోనా ప్రబలుతున్న సమయంలో వీధి పిల్లలు ఎక్కడ వైరస్ బారిన పడతారోనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హుటాహుటిన ఈ కార్యక్రమం చేపట్టింది.