అమరావతి: తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజధాని కోసం నాలుగు ఎకరాల భూమిని లాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతు రమేష్ కుమార్ రాజధాని తరలింపుపై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రమేష్ వంటిపై పెట్లోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడటంతో స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.
previous post
next post