ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం జగన్ తీసుకున్న ఉచిత విద్యుత్తు బదులు నగదు బదిలీ పథకం రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అవసరం లేకపోయినా విద్యుత్ మీటర్లు పెడుతున్నారన్న అభిప్రాయం వారిలో బలంగా నాటుకుపోయింది. కేంద్రం కచ్చితంగా మీటర్లు పెట్టాలని చెప్పలేదని…. టిడిపితో సహా రైతు సంఘాలు, విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాంటప్పుడు అసలు మీటర్ల పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఒకరికి మూడు నాలుగు చోట్ల పొలాలు ఉండటంతోనే అన్నిటికీ విద్యుత్ కనెక్షన్లు ఉండడం దగ్గరనుండి అనేకానేక సమస్యలు ఈ మీటర్ల ఏర్పాటు వల్ల వస్తాయి. ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నో నిబంధనలు పెడుతోంది. లబ్ధిదారులను తీసివేసేందుకు వారు కొన్ని కొత్త నిబంధనలు తీసుకువచ్చారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. రైతులకి కరెంట్ మీటర్ పెట్టిన తర్వాత అసలు ఉచిత విద్యుత్ కి మీరు అర్హులే కాదు అంటే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతున్నారు. వారి భయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతిరోజు పత్రికల్లో తమ అనుకూల మీడియాతో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తోంది. అయితే రైతులకు భరోసా ఇచ్చేందుకు మాత్రం అక్కడ తగినన్ని వివరాలను పొందుపరచకపోవడం గమనార్హం.
ఇక రైతుల్లో ఒకసారి ఆందోళన పెరిగితే వారిని అదుపు చేయడం కష్టం. వైసిపికి పటిష్టమైన ఓటు బ్యాంకు కూడా వారే. ఆందోళనలు తగ్గించడానికి నేతలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. ఉచిత విద్యుత్ ఇచ్చే ఇతర రాష్ట్రాలు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం లేదు… కేంద్రానికి పూర్తి స్థాయి కమిట్మ్ర్ంట్ లేకపోవడంతో రైతుల అనుమానాలు బలపడుతున్నాయి. ఇది ఏపీ ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?