ఢిల్లీలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను బుగ్గన కొద్దిసేపటి క్రితం కలిశారు. పెండింగ్ నిధులపై ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు అడ్డంకి ఉండకూడదన్న జగన్ ఉద్దేశం మేరకు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆ మేరకే కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జరుగుతున్న ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ కూడా బుగ్గన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ పూర్తైన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా బుగ్గన కాసేపట్లో కాలుస్తారని తెలుస్తోంది.