Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో సంచలన నిర్ణయం తీసుకోవటం జరిగింది. విషయంలోకి వెళితే రైల్వే ఆన్లైన్ టికెట్ మాదిరిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేక వెబ్ సైట్ జగన్ ప్రభుత్వం తీసుకురానుంది. ఈ క్రమంలో టికెట్ల బుకింగ్ పోర్టల్ కి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీకి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సినిమా హాల్ ఆన్లైన్ బుకింగ్ విధానం తో టికెట్ రేట్ మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్లి పోయినట్టయింది. సినిమా కలెక్షన్ మొత్తం ప్రభుత్వం చేతుల్లో కి వస్తుంది. దీంతో ప్రతి నెల 30వ తారీఖున నిర్మాతలకు అదేరీతిలో డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా.. ప్రభుత్వమే ఇవ్వనుంది. అప్పటిదాకా డబ్బులు మొత్తం ప్రభుత్వం దగ్గరే ఉంటాయి.
జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇదే మాదిరి విధివిధానాలు తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో.. టికెట్ల రేట్లు విషయంలో పారదర్శకత వస్తుందని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ సినిమా టికెట్ల బుకింగ్ విధానం ద్వారా ఇక నేరుగా ప్రేక్షకులు సినిమా థియేటర్ల దగ్గర.. టికెట్ల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉండకపోవటం మాత్రమే కాక.. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే విధానం కూడా ఇక నుండి ఏపీలో ఎక్కడా ఉండదు.
టాలీవుడ్ పెద్దలకు షాక్..
మొత్తం టికెట్ల ధర ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో… అడ్డగోలుగా పెద్ద పెద్ద సినిమాలు వచ్చిన టైంలో ప్రేక్షకులు వద్ద దోచుకునే పరిస్థితి కనబడదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సినిమా ప్రేక్షకుడికి సంతోషం కలిగించక మరోపక్క ఇండస్ట్రీలో బడా బాబులకు షాక్ ఇచ్చినట్లు అయిందని వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే టికెట్ల రేటు పెంపు విషయంలో ఇంకా రాష్ట్రంలో సినిమా థియేటర్ ల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద వాళ్లు.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మాట్లాడాలి అని బేటీ కూడా నిర్వహించాలని సెప్టెంబర్ మూడో తారీకు ముహూర్తం ఫిక్స్ కాగా అది క్యాన్సిల్ అయింది. అయితే మరోసారి భేటీ అయ్యే పరిస్థితి ఉన్న తరుణంలో తాజాగా ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ల రేటు విషయంలో ఆన్లైన్ విధానం అమల్లోకి తీసుకురావటం రాజకీయంగా సినిమాపరంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా.. ఈ విషయంపై.. సమావేశంలో చర్చిస్తారు అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా వరకు టికెట్ ధర.. సదరు నిర్మాత.. ఇండస్ట్రీకి చెందిన వారు నిర్ణయించారు వీటిలో వ్యవహరించాలని అనుకున్న టైంలో.. టికెట్ ధర ప్రభుత్వాధీనంలో ఉండేలా జగన్ ప్రభుత్వం తాజా ఆదేశాలు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. మరోపక్క ఈ వార్త కొంతమందిని అణగదొక్కడానికి జగన్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది అంటూ విపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి వ్యవహరించి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అటు రాజకీయంగా సినిమాపరంగా చర్చనీయాంశంగా మారింది.