PRC: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల అర్ధాంతరంగా ముగిసాయి. ఆరున్నర గంటలకు పైగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీంతో మరో సారి రేపు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. ఫిట్ మెంట్ 46 శాతం అడుగుతున్న ఉద్యోగ సంఘాలు కనీసం 34 శాతం అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 14.29 శాతం ఫిట్ మెంట్ అంగీకరించబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.హెచ్ఆర్ఏ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఎక్కువ అవుతుందని భావించిన బుగ్గన, సజ్జలలు రేపు మరో సారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల నేతలు బేటీ అవుతారు. ఉద్యోగ సంఘాల తరపున జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హజరైయ్యారు. పిఆర్సీ సహా పలు ప్రధాన డిమాండ్ లపై సమీక్ష నిర్వహించారు.
Read More: YSRCP: పార్లమెంట్ వేదికగా కథ చెప్పి.. జగన్ సలహాదారుల గాలి భలే తీశారుగా ఎంపి మిథున్ రెడ్డి..!!
PRC: రెండు రోజులు ఓపిక పడితే
సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా పీఆర్సీ, హెచ్ఆర్ఏ పై చర్చించామని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి నిబద్దతతో ఉన్నామనీ పేర్కొన్న సజ్జల.. గురువారం మరో సారి చర్చలు జరుపుతామన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆందోళనలు విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని చెప్పారు. ఉద్యోగులకు లబ్ది చేకూరుస్తామనీ, కోత విధించమని తెలిపారు. రెండు రోజులు ఓపిక పడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సజ్జల వెల్లడించారు.