(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఉద్యోగులకు డీ ఏ పెంపుపై జగన్మోహన రెడ్డి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
2018 లో జులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నది. దీంతో కరువు భత్యం 27.248 నుండి 30.392కి పెరిగినట్లు అయ్యింది. 2021 జనవరి జీతాలతో (ఫిబ్రవరి 1న) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018 జూలై 1నుండి 2020 డిసెంబర్ 31వరకు 30 నెలల బకాయిలు జీ పి ఎఫ్, జడ్పి పిఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎఫ్ వారికి 30 నెలల అరియల్స్ 90 శాతం నగదుతో పాటు పది శాతం ప్రాన్ అకౌంట్కు, జనవరి జీతాల చెల్లింపు తరువాత మూడు సమ భాగాల్లో జమ చేస్తామని తెలిపింది. 2019 జనవరి డీఏ 2021 జూలై నుండి..2019 జూలై డీఏ..2022 జనవరి నుండి చెల్లించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.