AP Government: అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కౌలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జూన్ నెల వచ్చినా కౌలు డబ్బులు చెల్లించలేదంటూ మందడం రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటషన్ పై రేపు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి నేడు రైతుల కౌలు చెల్లింపులకు గానూ రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం రైతులకు కౌలు చెల్లించాల్సిందిగా ఏఎంఆర్డీఏ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read More: Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామాకు మరో సారి షాక్ ఇచ్చిన ఈడీ..!!
హైకోర్టులో కేసు విచారణకు రాకముందే ప్రభుత్వం కౌలు చెల్లింపునకు నిధులు విడుదల చేయడంతో మరో మారు కోర్టు నుండి అక్షింతలు పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందని అంటున్నారు రాజధాని రైతులు.