ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈరోజు అమరావతి రైతుల వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు రోజుల్లో మొత్తం వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఆదేశాలు వచ్చాయో లేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ పనిని పూర్తి చేసింది.
వార్షిక కౌలు రూ.158 కోట్లు, 2 నెలల పెన్షన్ రూ.9.73 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అమరావతి రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. అయితే కౌలు హక్కుల పెన్షన్ ను 5 వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని, అయితే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదని బొత్స తెలిపారు.