విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి అనుసంధానమైన స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన తర్వాత అందులో జరిగిన అగ్ని ప్రమాదం తో ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తన పూర్వపు తప్పిదాల నుండి తేరుకున్న ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సెంటర్లపై కొరడా ఝలిపించింది. విజయవాడలో ఏకంగా 5 కోవిడ్ సెంటర్ల అనుమతిని రద్దు చేసింది.
రమేష్ ఆస్పత్రి వారి స్వర్ణ హైట్స్, డాక్టర్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడు లో హోటల్ అక్షయ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్ లో హోటల్ ఐరా, ఎన్నారై హీలింగ్ హాండ్స్ వారి సన్ సిటీ, ఆంధ్ర హాస్పిటల్స్ వారి కృష్ణ మార్గ్ ను ఇకపై కోవిడ్ సెంటర్లుగా పరిగణించరాదని తేల్చేశారు
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రోగుల నుండి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సెంటర్ల పై వేటు వేశారు.