కాపు ఉద్యమకారుడు.. ముద్రగడ పద్మనాభం 2016 లో కాపులను బిసి క్యాటగెరీ లోకి చేర్చాలని…. చంద్రబాబు హయంలో కాపు ఉద్యమానికి ‘తుని’లో పిలుపునిచ్చినప్పుడు అందులో భాగంగా హింసాకాండ చెలరేగగా.. ఉద్యమకారులంతా కలిసి ఏకంగా ట్రైన్ తగలబెట్టిన ఘటన తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు ఇన్నిరోజులు కోర్టులో నడుస్తూనే ఉంది.
ఎన్నో వాదోపవాదాల మధ్య కొంత మందికి శిక్ష పడగా అసలైన కారకులు ఇంకా తప్పించుకుని ఉన్నారని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ కేసు పై ఇప్పటిదాకా పట్టుదలతో ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ నడిపిస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తుని కాపు ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇక ఇలాంటి సమయంలో దాదాపు నాలుగేళ్ళ తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తాను విరమించుకున్నట్లు ప్రకటించడం జరిగిన మూడు వారాలకే వైసిపి ప్రభుత్వం కాపు ఉద్యమ కేసులన్నింటినీ ఉపసంహరించుకోవడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం.