YS Jagan: మహమ్మారి కరోనా భారత దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో వచ్చిన దానికంటే సెకండ్ వేవ్ లో… దేశంలో చాలా మంది మరణించారు. ఊహించని విధంగా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో.. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ప్రభుత్వాలు తల్లడిల్లిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా మంది మరణించారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగస్తులలో కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
విషయంలోకి వెళితే కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కుటుంబాలలో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ నవంబర్ 30 కల్లా కంప్లీట్ అయ్యేలా జిల్లా అధికారులకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి సాగదితలు… ఉండకూడదు అని స్పష్టం చేయడం జరిగింది. ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఏమాత్రం.. రోడ్డున పడకుండా ఉండే రీతిలో ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. సెకండ్ వేవ్ చాలా మంది ని దెబ్బతీసింది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక శాఖలలో ఉద్యోగస్తులు మరణించడం జరిగింది.
జిల్లా కలెక్టర్లకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు…
దీంతో ఏ ఏ శాఖలలో ఎంత మంది మరణించారు అన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి సమాచారం… వచ్చిన తర్వాత.. మరణించిన కుటుంబాలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ బాధ్యతలను అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేలా జిల్లా కలెక్టర్లకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈరోజు వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో జగన్ ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎంత మంది మరణించారు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వంటి విషయాలు మొత్తం సేకరించి త్వరలోనే.. ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలలో అర్హులైన వారికి ఉద్యోగం వచ్చే నెలాఖరుకల్లా ఇచ్చే రీతిలో.. ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.