ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 విజృంభిస్తోంది. టెస్టులు పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. చికిత్సకు కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెల్సిందే.
ప్రస్తుతం ఈ ఆసుపత్రుల పర్యవేక్షణకు ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారిని నియమించింది. ఐఏఎస్ రాజమౌళిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జరీ చేసింది. త్వరలోనే రాజమౌళి బాధ్యతలు తీసుకునే అవకాశముంది. అలాగే ఐటీ, E&C కార్యదర్శిగా భానుప్రకాష్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలకు చేరుకుంటోంది. ఇందులో 12వేల మంది తిరిగి కోలుకోగా, దాదాపు 277 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.