AP govt barrowed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలునకు ఏడాపెడా అప్పులు చూస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన నవరత్న హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా అందినకాడికి అప్పులు తీసుకువస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకుల నుండి ఎంత అప్పు తీసుకువచ్చింది అనే లెక్కలను కేంద్రం వెల్లడించింది. ఏపి ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల ద్వారా రూ.57,479 కోట్ల అప్పు చేసిందని కేంద్రం తెలిపింది. 40 ప్రభుత్వ కార్పోరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని చెప్పింది.
AP govt barrowed: బ్యాంకుల ద్వారా రూ.57,479 కోట్ల అప్పు
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2019 – 21 మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్బీఐ రూ.11,937 కోట్లు ఇవ్వగా, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.10,865లు, బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.7 వేల కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 2,970లు, కెనరా బ్యాంకు రూ.4,099లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు రూ.7,50 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు రూ.1,750లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.6,975 కోట్లు రుణాలు ఇచ్చినట్లు తెలియజేసింది.
Read More: Sasikala Meets Rajinikanth: సూపర్ స్టార్ రజనీతో శశికళ భేటీ..! ఆ రెండు కారణాలు..!!