అమరావతి: విశాఖ మన్యంలో బాక్సైజ్ తవ్వకాలపై జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో బాక్సైట్ గనుల తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా చింతపల్లి, అరకు మండలాలు, అనంతగిరి, గాడికొండ, చింతమగొంది, రక్తకొండ ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు చాలా కాలంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో గిరిజనులకు బాక్సైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు బాక్సైట్ తవ్వకాలకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
previous post
next post