NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP GOVT: జగన్ కు బిగ్ షాక్ ..! ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు..!!

AP GOVT: ఏపి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ కు షాక్ ఇచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి. సీఎంఓ అధికారులు చేతులు చేతులు ఎత్తేయడం, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను అవమానించే రీతిలో మాట్లాడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమైయ్యారు. చాలా రోజులుగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వేచి చూశారు. ఇటీవల వరుస సమావేశాలను నిర్వహించిన ఉద్యోగ సంఘాల నేతలు తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో, ఆ తరువాత ఆయన ఆధ్వర్యంలో సీఎంఒ అధికారులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి వీరి డిమాండ్ల పై స్పష్టమైన హామీ లభించలేదు. పిఆర్సీ తో పాటు పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలన్న డిమాండ్ తో వచ్చే నెల నుండి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేయనున్నారు. నిరసన కార్యాచరణకు సంబంధించి నోటీసును డిసెంబర్ 1వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మకు ఇవ్వాలని నిర్ణయించారు.

AP GOVT employees protest activity action plan announced
AP GOVT employees protest activity action plan announced

AP GOVT: డిసెంబర్ 7 నుండి తొలి దశ ఉద్యమం

రాష్ట్రంలోని రెండు ప్రధాన జేఏసీలు …ఏపి జేఏసి అమరావతి, ఏపి జేఏసీ నేతలు ఉమ్మడిగా ఉద్యమ కార్యచరణ ప్రకటించాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకూ తొలి దశ కార్యాచరణ ప్రకటించాయి. ఏపి జేెఎసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపి జేఏసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, హృదయరాజు, వైవీ రావు తదితరులు నిరసన కార్యక్రమాలను వెల్లడించారు. డిసెంబర్ 7 నుండి 10వ తేదీ వరకూ అన్ని ఆఫీసులు, స్కూళ్లు, తాలూకా పరిధిలోని ఆఫీసులు, డివిజన్, జిల్లా స్థాయి ఆఫీసులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఏపిఎస్ ఆర్ టీ సీ డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నారు. డిసెంబర్ 13న అన్ని మండల, డివిజన్ స్థాయిల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. డిసెంబర్ 16న ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నాలు, డిసెంబర్ 21న జిల్లా స్థాయిలో మహాధర్నాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 27న విశాఖలో సాయంత్రం 4 గంటలకు ఒక ప్రాంతీయ సదస్సు, ఆ తరువాత వరుసగా 30న తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో, జనవరి 6న ఒంగోలులో ప్రాంతీయ సభలను నిర్వహించనున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!