(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన శ్రీనాథ్ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు ఎనిమిదిన ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీ చేశారు. నవంబర్ 21న శ్రీనాథ్ బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వై ఎస్ ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్ ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులు. ఏపియూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన శ్రీనాథ్ ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.పనిచేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?