సంక్రాంతి సీజన్ లో పోటీలో దిగుతున్న చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య మువీ, బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సింహారెడ్డి మువీలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొద్ది గంటల్లో అధికారికంగా ఉత్తర్వులను ఏపి ప్రభుత్వం విడుదల చేయనుంది. వాల్తేర్ వీరయ్యకి రూ.25లు, వీర సింహారెడ్డికి రూ.20 లు పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
చిరంజీవి సినిమాకు రూ.45లు, బాలకృష్ణ సినిమాకు రూ.40లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మైత్రీ మువీ మేకర్స్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో తొలుత అధికారులు రూ.45లు పెంచేందుకు అనుమతి ఇస్తూ ఫైల్ ఓకే చేశారు. అయితే చివరి నిమిషంలో చిరంజీవి సినిమాకు రూ.25లు, బాలకృష్ణ సినిమాకు రూ.20లు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం కొద్దిసేపటిలో అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది.
వీరసింహారెడ్డి మువీ జనవరి 12న విడుదల కానుండగా, వాల్తేర్ వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తొంది. మరో పక్క తెలంగాణ సర్కార్ కూడా ఈ రెండు సినిమాల పట్ల అదారంగా స్పందించింది. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య మువీలకు స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఆమోదం తెలిపింది. దాంతో రిలీజ్ రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం ఆరు షోలు వేయనున్నారు.
ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా