రైతులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పబోతున్నారు. అక్టోబర్ 1న ఆయన రైతులకు శుభవార్త చెప్పనున్నారు. ఇప్పటికే రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఏపీ ప్రభుత్వం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఏపీలో సాగుచేసే వివిద పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించనుంది. దాన్నే ఎంఎస్పీ ధర(MSP Price) అని అంటారు.
దీనికి సంబంధించి ఏ పంటలకు.. ఎంత మద్దతు ధర ఉంటుందో.. అక్టోబర్ 1న ప్రకటించడంతో పాటుగా… అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర డిస్ ప్లే రూపంలో రైతులకు చూపించనున్నారు. దీంతో ఎక్కడా మద్దతు ధరలో అవినీతి జరగకుండా.. పారదర్శకంగా రైతులకు మద్దతు ధర అందేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరే రైతులకు చెందేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి మద్దతు ధరను అక్టోబర్ 1న ప్రకటించనున్నారు. అలాగే పంటల వివరాలను ఈ క్రాపింగ్ విధానంలో డిస్ ప్లే చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించేటప్పుడు రైతుల వివరాలను కూడా సరిగ్గా నమోదు చేయాలని జగన్ తెలిపారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల వద్ద మల్టీ పర్పస్ ఫెసిలిటీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.