మహమ్మారి కరోనా వైరస్ ఇండియా లో వచ్చిన ప్రారంభంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఏపీ రాష్ట్ర పనితీరు చాలా మంది ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంది. ఎక్కడికక్కడ విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తిస్తూ కట్టడి చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్ల తో విదేశీ ప్రయాణికులను గుర్తించిన జగన్ సర్కార్ వాళ్లని ఇంటికే పరిమితం చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
అంత మాత్రమే కాక ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ఎక్కడికక్కడ కరోనా చైన్ తెగిపోయేలా వ్యవహరించింది. ఇప్పుడు ఇదే రీతిలో కొత్తరకం కరోనా విషయంలో కూడా ఏపీ సర్కార్ పగడ్బందీగా ముందుకు వెళుతుంది. మేటర్ లోకి వెళ్తే కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూనే మరోపక్క కరోనా నిర్ధారణ పరీక్షలు మరింతగా పెంచాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం.
అంత మాత్రమే కాక విశాఖపట్టణం, గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్దా బ్రిటన్ దేశం నుండి వచ్చిన వారిని గుర్తిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు చేసి కేంద్రం అనుసరించిన గైడ్లైన్స్ పాటించాలని ఏపీ సర్కార్ రెడీ అయింది. అదేవిధంగా హైదరాబాద్ నుండి కారు మార్గంలో వచ్చిన వారిని సైతం అనగా విదేశీ ప్రయాణం చేసిన వారిని గుర్తించాలని ఎవరిని విడిచిపెట్టకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో పది సంవత్సరాల లోపు పిల్లలకి, 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.