NewsOrbit
న్యూస్

బ్రాహ్మిణికి కొత్త సవాల్…! నారా వారి వ్యాపారంపై జగన్ మార్కు దెబ్బ…!

ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే రాజకీయంగా… వ్యక్తిగతంగా.., ఆర్ధికంగా అన్ని విధాలుగా కొట్టొచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేవి ఏమి లేవు. సందు దొరికితే రాజకీయ ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేసెయ్యడమే. కుట్రలో, కేసులో వేసి ముప్పుతిప్పలు పెట్టెయ్యడమే. ఏపీలో ఇది చంద్రబాబు, వైఎస్ సమయంలోనే మొదలయ్యింది, ఇప్పుడు పీక్స్ కి వెళ్ళింది. చంద్రబాబు సగం చేస్తే, జగన్ దాన్ని సంపూర్ణం చేస్తూ… బాబునే బలిపశువుని చేసే ప్లాన్లు అమలు చేస్తున్నారు. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టడం కొంత వరకు అయింది. బాబు వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు వచ్చేస్తే బాబు ఇక మిగిలేది సూన్యమే. ఇక ఆర్ధికంగా, వ్యక్తిగతంగా కూడా దెబ్బ పడితే…! బాబు అక్రమ వ్యాపారాలను కూల్చేస్తే కోలుకునే శక్తి ఉండదు…! అందుకే జగన్ కొత్త ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు.

హెరిటేజ్ కి పోటీగా అమూల్…!

చంద్రబాబుది పాల వ్యాపారం. ఎవరు అవునన్నా, కాదన్నా… ఫ్యూచర్ గ్రూపుకి అమ్మేసినా, రిలయన్స్ వాళ్ళు కొనేసినా… హెరిటేజ్ అంటే చంద్రబాబుదే. దాని నిర్వహణ చూస్తున్నది భువనేశ్వరి.., వారి కోడలు బ్రాహ్మిణి..! ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఎందుకంటే…! చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు హెరిటేజ్ షేర్లు పైకి వెళ్తాయి. మార్కెట్ విపరీతంగా ఉంటుంది.

 

అందుకే ఇక్కడ హెరిటేజ్ కి దెబ్బ కొడితే నారా వారి ఆర్ధిక ఊచలు కదిలినట్టే. హెరిటేజ్ వ్యాపార మూలాల్ని కొట్టాలి అంటే పోటీగా మరో పాల వ్యాపార సంస్థ రావాలి. సాదా సీదాగా కాదు, మల్టి లెవల్ మార్కెటింగ్ సత్తా ఉన్న పాలవ్యాపారి రావాలి, వారికి ప్రభుత్వం అండగా నిలవాలి అనుకుంటున్న సమయంలో జగన్ కి దొరికింది అమూల్. “ఇక అమూల్ కి మన రాష్ట్రంలోని ప్రభుత్వ సహకార డెయిరీల ద్వారా ఒప్పందం కుదిర్చి పాల సేకరణ ఎక్కువయ్యేలా చూడడం. ఇది రెండు రకాలుగా ప్రయోజనం. మొదటిది హెరిటేజ్ కి సరైన పోటీ, రెండోది ప్రభుత్వ సహకార పాల డెయిరీలు నిలదొక్కుకునే ఛాన్స్ ఉంటుంది. రెండోది సులువే, మొదటిటి జరగాలంటే సరైన మూలాల్లోకి వెళ్ళాలి. హెరిటేజ్ నిర్వహణ ప్రస్తుతం నారా వారి కోడలు బ్రాహ్మిణి చేతుల్లో ఉంది. ఆమె బాగా నడిపిస్తున్నారు. ఆమెకే ఇది సవాల్.

ఏ ఏ జిల్లాల్లో ఎలా…!

హెరిటేజ్ సంస్థకి ఆంధ్రాలో పూర్తిగా పట్టులేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీగా వ్యాపార లావాదేవీలున్నాయి. విశాఖలో, సీమ జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా పాలు పొసే రైతులున్నారు. ఏఏ జిల్లాల్లో సహకార డెయిరీలు బలంగా లేవు. అందుకే ఇప్పుడు ఏఏ జిల్లాల్లో సహకార డెయిరీలను ఏర్పాటు చేసి, అమూల్ కి లింక్ చేసి, రైతులు అమూల్ కి పాలు పోసేలా చేస్తే రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. సో… జగన్ ఆదేశించారు. సహకార అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. వచ్చే నెల్లో ఉత్తర్వులు వస్తాయి. అమల్లోకి వస్తుంది.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N