ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ విద్యా విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సిలబస్ ను 30 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల పై భారం తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీని కింద ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 30 శాతం సిలబస్ ను తగ్గించారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచారు. ఇంకా ఆయా సబ్జెక్టుల్లో తొలగించిన పాఠ్యాంశాల వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరిచారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్సీ 2020-21 విద్యా సంవత్సరానికి 30 శాతం సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సాధారణంగా 220 పని దినాలు రావాల్సి ఉండగా సెప్టెంబర్ 5 నుండి కాలేజీలు ప్రారంభిస్తే 175 వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా కాలేజీలు సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?