తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెంది ఉంది. ఇప్పటికే 158 మంది దేవస్థానం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఇటువంటి సమయంలో జగన్ సర్కార్ వెంటనే దేవస్థానం దర్శనాన్ని వెంటనే ఆపివేయవలసిందిగా పలువురు కోరుతున్నారు. అయితే ఎన్ని హెచ్చరికలు వచ్చినప్పటికీ ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో జాగ్రత్త పడటం లేదు.
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గుడిలు, ప్రార్థన మందిరాలు, మసీదులు, చర్చిలు తెరిచారు కానీ తిరుమలలో జనసందోహం మరియు అక్కడ వైరస్ ప్రబలే అవకాశాలు ఎక్కువ కాబట్టి కనీసం తిరుపతి దేవస్థానం గుడి తలుపులు అయినా మూసి వేయడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 158 మంది సిబ్బందికి వైరస్ సోకింది. రోజుకి సగటున 12 వేలమంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రాణలు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రిస్క్ లో ఉన్నారని చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఆలయాలు మరియు ప్రార్థన మందిరాలకు అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం తెరిచేది…లేనిదానిపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది కాబట్టి ఇలా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం దర్శనం కొనసాగించడం చాలా విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. ఇక ప్రతిపక్షం మరియు ఇతర వర్గాల నుండి విమర్శలు రాకమునుపే దేవాలయాల తలుపులు మూసివేయడం మంచిది. \ దేవస్థానం కూడా ప్రభుత్వం తో చర్చించి ఈ విషయమై వెంటనే ఒక నిర్ణయం తీసుకొని జరగబోయే విపత్కర పరిణామాలను ఆపడం మంచిది ఇది అని పలువురి సలహా.