అక్రమ రవాణా కొనుగోలు కేసు నమోదుపై తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు. ఐతే కేసు నమోదు కోసం ప్రభుత్వానికి రిఫరెన్స్ ఇచ్చిన హైకోర్టు, ఆ ప్రకారంగా కేసు నమోదు చేయకుంటే మాత్రం కోర్టు ధిక్కరణ కేసు కింద పిటీషన్ దాఖలు చేయాలని ఏబీకి సూచించింది.
టీడీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వరావు ఇంటిలెజెన్స్ చీఫ్ గా పనిచేసారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లఘించారని ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే హైకోర్టు ఆ ఉత్తర్వులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లోకి తీసుకోవడంతో పాటు సస్పెన్షన్ నాటి జీతభత్యాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.