పరిపాల వికేంద్రీకరణ చట్టంపై స్టేటస్ కోను పొడిగిస్తూ వస్తోన్న హైకోర్టు మరోసారి దాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు చట్టంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. స్టేటస్ కో అమలును వచ్చేనెల 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజూ వారీ విచారణ జరగనుందని తెలిపింది. పరిపాలన వికేంద్రీకరణ చట్టంపై విధించిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా అందుకు అంగీకరించని కోర్టు మరోసారి పొడిగించింది. దీంతో వీలైనంత తొందరగా రాజధానిని మార్చాలని చూస్తోన్న జగన్ సర్కారుకు మరొక భారీ షాక్ తగిలినట్లైంది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులకు ఈ ఏడాది జూలై 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించిన సంగతి తెల్సిందే.