రాజధాని వికేంద్రీకరణకు మరోసారి బ్రేకులు పడ్డాయి. ఏపీ పరిపాలనా వికేంద్రకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ స్టేటస్ కో గడువు ముగియడంతో మరోసారి స్టేటస్ కో ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఈ నెల 27 వరకూ స్టేటస్ కో ను పొడిగించింది. మూడు రాజధానుల అంశంపై పలువురు పిటీషన్లు వేయడంతో విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో ఇచ్చి ప్రభుత్వాన్ని రిప్లై ఇవ్వమని సూచించింది. విచారణను ఆగష్టు 14కు వాయిదా వేసిన కోర్టు ఇప్పుడు మరోసారి 27కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా రాజధాని తరలింపు విషయమై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో సవాల్ చేసింది. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రస్తావించింది.