అమరావతి: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిల్పై బుధవారం వాదనలు జరిగాయి. 59లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయంటూ న్యాయవాది సుధాకర్ రెడ్డి వివరించారు.
బోగస్ ఓట్లను తొలగించామంటూ ఎన్నికల సంఘం తరపు న్యాయవాదుల కౌంటర్ ఫైల్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా బోగస్ ఓట్లను చూపిస్తామని కోర్టుకు వివరించారు.
ఈ క్రమంలో బోగస్ ఓట్ల తొలగింపులో ఈసీ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తొలగింపు లెక్కలు కోర్టుకు సమర్పిస్తామని, సోమవారం వరకు గడువు కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.