NewsOrbit
న్యూస్

AP High Court: రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ అందించిన హైకోర్టు…

AP High Court: రాజధాని ప్రాంత అమరావతి రైతులకు ఏపి హైకోర్టు గుడ్ న్యూస్ అందించింది. అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుండి తిరుమల వరకూ మహాపాద యాత్ర చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే రైతులు పాదయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. జేేఏసీ నేతలకు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ స్పష్టం చేస్తూ లేఖ అందించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి జేఏసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై  హైకోర్టు కోర్టు విచారణ చేపట్టింది.,

AP High Court gives permission for amaravathi farmers padayatra
AP High Court gives permission for amaravathi farmers padayatra

AP High Court: షరతులతో మహాపాదయాత్రకు అనుమతి

ఈ పిటిషన్ పై రైతులు పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకు ఏమిటి అభ్యంతరం అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు గ్రామాల్లోకి వెళితే వారిపై రాళ్లు విసిరే ప్రమాదం ఉందని, రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ దీనిపై వాదనలు వినిపిస్తూ రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని తెలియజేస్తూ..అనుమతి ఇవ్వలేమంటూ డీజీపీ రాసిన లేఖలో సరైన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రైతుల పాదయాత్రకు షరతులతో కోర్టు అనుమతి ఇచ్చింది.

నవంబర్ 1 నుండి 45 రోజులు పాదయాత్ర

రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 17 వరకూ 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసి, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరో పక్క న్యాయపోరాటం చేస్తున్నారు. మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా కూడా కొందరు కొద్ది రోజులు శిబిరాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టు విచారణలో ఉంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N