AP High Court: సస్పెన్షన్ లో ఉన్న జడ్జి రామకృష్ణ కు ఏపి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. విచారణ అధికారికి సహకరించాలనీ, కేసు అంశంపై మీడియాతో మాట్లాడవద్దనీ ధర్మాసనం ఆదేశించింది. జడ్జి రామకృష్ణ ప్రస్తుతం పీలేరు సబ్ జైలులో ఉన్నారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వపైనా, సీఎం జగన్ పైనా ప్రజల్లో ధ్వేషం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగంపై జడ్జి రామకృష్ణను ఏప్రిల్ నెలలో పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు మేరకు జడ్జి రామకృష్ణ పై ఐపీసీ సెక్షన్ 124 కింద పోలీసులు అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.
అయితే చిత్తూరు జిల్లా జైలులో తన తండ్రికి ప్రాణ హాని ఉందనీ రామకృష్ణ కుమారుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారక్ కు వచ్చిన మరో ఖైదీ తన తండ్రిని బెదిరించారనీ, బెదిరించిన వ్యక్తి వద్ద కత్తి కూడా దొరికిందనీ లేఖలో రామకృష్ణ కుమారుడు వివరించారు. దీంతో చిత్తూరు జిల్లా జైలు నుండి జడ్జి రామకృష్ణను పీలేరు జైలుకు తరలించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?