AP High Court: ప్రభుత్వ పాఠశాలల స్థలాల స్థలాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను తొలగించాలంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హైకోర్టు ఆదేశాల మేరకు ఏడుగురు ఐఏఎస్ అధికారులు హజరైయ్యారు. ఐఏఎస్ లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, బీ రాజశేఖర్, వి చిన వీరభద్రుడు, శ్యామలరావు, విజయకుమార్, ఎంఎం నాయక్ లు హజరైయ్యారు ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 1160 ప్రదేశాలలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బికే), గ్రామ సచివాలయ భవనాలు నిర్మించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. వీటిలో 450 నిర్మాణాలను వేరే చోటకు మార్చినట్లు ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొన్నది. మిగిలిన నిర్మాణాలు నాలుగు వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
అయితే ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలను వదిలివేయడం ప్రభుత్వానికి ఇబ్బందే. హైకోర్టు ఆదేశాలను గౌరవించి పాఠశాలల స్థలాల్లో ఉన్న వాటిని తొలగిస్తుందా లేక హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందా అనేది వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?